ప్రకాశం: 132/33 కేవీ గిద్దలూరు సబ్ స్టేషన్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలం యడవల్లి సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు.