TPT: తిరుపతి రూరల్ చెర్లోపల్లి వద్ద శుక్రవారం ఓ వ్యక్తి అంత్యక్రియల నేపథ్యంలో కాసేపు ఆందోళన రేపింది. చెర్లోపల్లి రజకుల కాలనీకి చెందిన రాధాకృష్ణయ్య మృతి చెందాడు. పెట్రోల్ బంకు పక్కనే ఆయనకు చెందిన స్థలం ఉండటంతో అక్కడే దహనక్రియలు చేశారు. ఇళ్లు, పెట్రోల్ బంకు వద్ద శవాన్ని కాల్చడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.