GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 4 గురిని పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరచగా, ఒకరికి 3 రోజులు, ముగ్గురికి 5 రోజులు జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమని తెలిపారు.