VZM: 2022లో జామి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం చోరీ కేసులో నిందితుడికి కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్సై వై.వి. జనార్ధన్ గురువారం తెలిపారు. అన్నంరాజుపేట గ్రామానికి చెందిన మంగమ్మ వద్దకు ఫ్లోర్ క్లీనింగ్ నెపంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆమె మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాకెళ్లారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి తీర్పుని వెల్లడించింది.