KDP: చింతకొమ్మదిన్నె పరిధిలోని మామిళ్లపల్లెలో అక్రమంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 11.49 లక్షల విలువైన 479 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన మహబూబ్ షరీఫ్ భారీగా సిలిండర్లను నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించి, ఆయనపై కేసు నమోదు చేశారు.