PPM: ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని, తిరిగి వారు సంతృప్తి వ్యక్తం చేసే దిశగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్.సి.డి అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. జగన్నాధపురం పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. తొలుత హెచ్.పి.వి వ్యాక్సిన్ లాంచింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వైద్య అధికారులు, సిబ్బందితో కలిసి వీక్షించారు.