GNTR: రాజధాని అమరావతిలో విద్యా, వైద్య, పరిపాలనా రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయపూడిలో CBSE ప్రాంతీయ కార్యాలయానికి 0.8 ఎకరాలు, కురగల్లు-నవులూరు ప్రాంతంలో ఏపీ ఎస్ఐఆర్డీ (AP SIRD) క్యాంపస్ నిర్మాణానికి 5.043 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నిడమర్రులో అత్యాధునిక కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు.