సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్లో గ్రామ సంఘం యానిమేటర్లకు (వీఓఏ) కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వీటిని అందజేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,311 మందికి ఈ ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు.