కాకినాడ: ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ఫలితాలను ఇన్స్పెక్టర్ బి. సూర్య అప్పారావు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు నిర్వహించిన తనిఖీల్లో 29 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయన్నారు. కోర్టు విచారణ అనంతరం నలుగురికి 3 రోజుల జైలు శిక్ష, మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఫైన్ వేశారు.