CTR: పెద్దపంజనిలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమ వద్ద అద్భుత శక్తులు గల వస్తువు ఉందని నమ్మించి ఓ బాధితుడి నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు.