SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పోలాకి మండలం పోలాకి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గం ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.