KRNL: ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందిన కేసారం సాయిరాం బైపీసీలో 921 మార్కులు సాధించాడు. కర్నూలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చదివిన అతన్ని కూలీ పనులు చేసే తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రభుత్వ కళాశాలలో చదివి మంచి ఫలితాలు సాధించడంతో ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.