CTR: పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో సింగల్ విండో ఛైర్మన్ పగడాల రమణ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు అడ్డుకోవడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మహిళలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని రమణ హెచ్చరించారు.