పార్వతీపురంలో ఏప్రిల్ 22వ తేదీన 6వేల మంది విద్యార్థులతో 18 నిమిషాలపాటు చారిత్రాత్మకంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులలో స్థానం పొందేలా కోటాటం నృత్యం ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను తప్పక హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ఆహ్వానించారు. ఈసందర్బంగా ఇంతటి బృహత్తర కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.