VZM: ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. శనివారం ఎస్.కోట క్యాంపు కార్యాలయంలో ఆలుగుబిల్లి గ్రామానికి చెందిన రాయవరపు మాలిని అనే మహిళకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల విలువైన ఎల్.వో.సీ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.