CTR: రొంపిచర్ల మండలంలోని పంచాయతీల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని చిత్తూరు జడ్పీ CEO రవికుమార్ నాయుడు ఆదేశించారు. రొంపిచర్లలో పన్ను వసూలును మంగళవారం ఆయన పరిశీలించారు. రొంపిచర్లలో రూ.7లక్షలు వసూలు కావాల్సి ఉందని.. త్వరగా కలెక్ట్ చేయాలని సూచించారు. పజులు పేటలో సీసీ రోడ్డు పనులు పరిశీలించారు. అనంతరం రామిరెడ్డిగారి పల్లెలో నీటి పథకాన్ని తనిఖీ చేశారు.