NTR: కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పట్టాయని, పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో రూ.92 లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను, డ్రెయిన్లను, గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు.