PPM: పిల్లలను తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించి, పాఠశాలలను బలోపేతం చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం చొక్కాపువానివలస గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 13.5 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన అదనపు పాఠశాల గదులను ఇవాళ ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.