ATP: రాప్తాడు నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు. అసంపూర్తిగా ఉన్న 32 భవనాలను పూర్తి చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభలో వివరించారు.