సత్యసాయి: తనకల్లులో ఆర్టీసీ బస్టాండు ఎనిమిదేళ్లుగా నిరుపయోగంగా మారింది. అధికారులు బస్సులను అంబేద్కర్ సర్కిల్ వద్ద నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు నీడ, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక దుకాణాల ముందు నిలబడాల్సి వస్తోంది. మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బస్సులను బస్టాండు నుంచి నడపాలని స్థానికులు కోరుతున్నారు.