విశాఖలోని మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. కూటమి పాలనలో రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.