KDP: ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒంటిమిట్ట, రేణిగుంట రహదారులపై ఈ మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 2 ఉదయం 8 గంటల వరకు మళ్లింపు కొనసాగుతుంది.