కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, గురువారం రాత్రి వల్లూరు పరిధిలోని టి.జి పల్లిలో SI శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. నేరగాళ్ల బెదిరింపులకు భయపడకుండా వెంటనే 1930 లేదా 112కి కాల్ చేయాలని సూచించారు.