W.G: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆకివీడు పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంబడి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నియంత్రించేందుకు తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం ట్విన్ బిన్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సాకేత్, సిబ్బంది పాల్గొన్నారు.