NDL: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ పరిశ్రమ వద్ద శుక్రవారం జరగాల్సిన సీపీఐ రైతు ధర్నా వాయిదా పడింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఎస్పీ, యాజమాన్యం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. ఇవాళ మంత్రి సహకారంతో యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలన్నారు.