TPT: శ్రీకాళహస్తి గుడికి అనుబంధంగా ఉన్న కైలాస సదన్, గంగా సదన్ వసతి గృహాలను ఆలయ ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ గురువారం సందర్శించారు. భక్తులకు అందుతున్న సేవలు, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోవాలని, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.