KRNL: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చల్లా ఓబులేసును నియమితులయ్యారు. గుంటూరులో అడిషనల్ కమిషనర్గా ఉన్న ఆయనను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. అలాగే నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న జి.శ్రీనివాసులు పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. కాగా, కొత్త కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.