ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 20వ తేదీ వరకు తీవ్రమైన వడగాలులు వీస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి హెచ్చరించారు. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.