కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరావాలని కోరుతూ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రిని కలుసుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, ప్రసాదం అందజేశారు.