KDP: సిద్ధవటం మండలం బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు గంగాభవాని ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు మాడా సుబ్బరాయుడు, రామకృష్ణలు ఇవాళ తెలిపారు. 24న అమ్మవారికి విశేష పూజలు, లక్ష కుంకుమార్చన, 25న గణపతి హోమం, 26న బోనాలు ఉంటాయన్నారు.