GNTR: ఎమ్మార్పీఎస్ నేత మందా కృష్ణ మాదిగ అర్చకులు, బ్రాహ్మణులపై చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని అర్చక & బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు అన్నారు. తెనాలిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనేక దేవాలయాల్లో బ్రాహ్మనేతరులు అర్చకులుగా ఉన్న విషయాన్ని కృష్ణ మాదిగ తెలుసుకోవాలని అనంతాచార్యులు, రఘు సూచించారు. దేశ విభజనకు మేము కారణమన్న వ్యాఖ్యలు దారుణమన్నారు.