నెల్లూరు సిటీలోని 14 స్కూళ్లను ఆధునికీకరించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఆధునీకరించే స్కూల్ భవనాలను 50 వేల చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మిస్తామని చెప్పారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకూ ఒకేచోట చదువుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. జాకీర్ హుస్సేన్ నగర్లోని అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఒకే చోటకి చేరుస్తామని పేర్కొన్నారు.