KRNL: పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అల్లి పీరాకు ఇవాళ సీఎం సహాయ నిధి కింద మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి రూ. 25వేల చెక్కును అందజేశారు. బాధితుడి చికిత్స ఖర్చులకు ఉపయోగించుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బోయ వెంకన్న, తాయన్న, రమేష్, చిన్న భీమేష్, శాంతప్ప, తదితరులు పాల్గొన్నారు.