PLD: ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ కార్యక్రమంలో భాగంగా 49వ రోజున శనివారం రాత్రి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు. నిరంతరంగా గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే తీరును స్థానికులు అభినందించారు.