BDK: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య రేపటి నుంచి 3 రోజుల పాటు భద్రాచలంలో పర్యటించానున్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం పర్ణశాలో రామయ్యను దర్శించుకుంటారు. అనంతరం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తారు. 19న ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని, పాపికొండల సందర్శనకు వెళ్తారు. 20న హైదరాబాదుకు తిరిగి వస్తారు.