KRNL: కోసిగి మండలంలో ఆరు సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమస్యకు ఇవాళ పరిష్కారం లభించింది. టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి చొరవతో, గ్రామ పెద్దల సమక్షంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు. ఈ పరిష్కారంతో కోసిగిలోని మూడు ఎస్సీ కాలనీల దళితులు, మండలంలోని ఇతర దళితులు సంతోషం వ్యక్తం చేశారు.