సత్యసాయి: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సామాజిక విప్లవకారుడిగా పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాటలో ప్రభుత్వం పయనిస్తుందని పేర్కొన్నారు.