KDP: చెన్నూరు(M) కనపర్తిలో చల్లా పౌలయ్య (70) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వరి కోత యంత్రం తగిలి చనిపోయాడని బంధువులు ఆరోపిస్తుండగా, ఎండకు పడిపోతే చేతిలోని కత్తి ఛాతీలో దిగి మరణించాడని డ్రైవర్ తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కొడుకు ఫిర్యాదుతో పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.