NTR: విజయవాడ లయోలా కళాశాల సమీపంలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భవనం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఫోన్లో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా పట్టు తప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.