శ్రీకాకుళంలోని నైరా వ్యవసాయ కళాశాలలో డా.బి.ఆర్. అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డా.జి.జోగినాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేశారు. అలాగే, యువత ఆయన ఆశయాలను ఆచరించాలని సూచించారు.