PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల జండా చెట్టు బజారులోని షాదీ ఖానాలో ముస్లింలకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు షేక్ జానీ సైదా విందులో పాల్గొని వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మదార్ సాహెబ్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.