అన్నమయ్య: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సోమవారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలో మంత్రి నివాసంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రమణారెడ్డి మంత్రికి పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని మున్సిపల్ కమిషనరుకు సూచించారు.