WG: నరసాపురం మండలం సరిపల్లి గ్రామ రైతులకు శుక్రవారం ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పాసు పుస్తకాలను అందజేశారు. భూ సమస్యల పరిష్కారం, రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సరిపల్లి రెవెన్యూ పరిధిలో మొత్తం 627 మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరయ్యాయని వివరించారు.