KDP: నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ ఫోన్- ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ.. 6వ డివిజన్లోని స్మశాన వాటికను పరిశీలించారు. రోడ్డుపైనే అంత్యక్రియల ముందు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు గుర్తించి, స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. ఇకపై స్మశాన వాటిక లోపలే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.