PPM: పీఎం జన్ మన్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అలసత్వం వహించకుండా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్, సెక్రెటరీలు పాల్గొన్నారు.