CTR: పుంగనూరులో న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ కోరారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరుకు వచ్చిన హైకోర్టు జడ్జి జయసూర్యను కలిసి పుంగనూరులో ఉన్న జడ్జిల సమస్యను ఆయనకు విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు విజయ్ కుమార్ తెలిపారు.