కృష్ణా: డ్రగ్స్ రహిత సమాజం కోసం నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర బుధవారం గన్నవరం మండలం చిన్నఅవుటపల్లికి చేరుకుంది. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలో మీటర్ల మేర వైబ్రేంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో విజయ్ కలాం బృందం యాత్ర కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా డా.పిన్నమనేని సిద్ధార్థ కళాశాలలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు.