W.G: భీమవరం పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్పర్సన్ S. శ్రీదేవి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ముద్దాయిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలు న్యాయవాదులను పెట్టుకోలేకపోతే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు.