KDP: ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు శుక్రవారం మోటార్ సైకిల్ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల చోరీపై విచారణ చేపట్టి, స్థానిక నడింపల్లె వీధికి చెందిన షేక్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసినట్లు CI కొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు SIలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డిలను జిల్లా SP అభినందించారు.