SS: పుట్టపర్తి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో గురువారం పౌరసరఫరాల శాఖపై జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు డోర్ డెలివరీ విధిగా చేయాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం నాణ్యతపై వినియోగదారుల సంతృప్తిని పెంచాలని సూచించారు.